నేషనల్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ వర్క్ షాప్ సదస్సుకు హాజరైన జిల్లా కలెక్టర్
వైయస్సార్ కడప జిల్లా, మహి న్యూస్ జులై 9 : న్యూఢిల్లీలో మంగళవారం ఒక రోజు జరిగిన నేషనల్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ వర్క్ షాప్ సదస్సు కు.. వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర గనులు మరియు పర్యాటక శాఖ మంత్రిని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కలిశారు.ఈ నేపథ్యంలో డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ కార్యకలాపాలు, జిల్లాలోని అభివృద్ధి పనులు గురించి ఆయనకు వివరించారు. అలాగే గండికోట ప్రాజెక్టులో జరుగుతున్న పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి మంత్రికి తెలియజేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0